Namaste NRI

భారత్‌ బయోటెక్‌కు ఎదురు దెబ్బ

కొవాగ్జిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ను బ్రెజిల్‌ నిలిపేసింది. ఆ దేశంతో జరిగిన ఒప్పందాన్ని భారత్‌ బయోటెక్‌ రద్దు చేయడంతో ట్రయల్స్‌ను ఆపేస్తూ ఆ దేశ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అన్వీసా (బ్రెజిల్‌ ఔషధ నియంత్రణ సంస్థ)కు భారత్‌ బయోటెక్‌ పంపించిన ప్రకటన తరువాతే ట్రయల్స్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నామని బ్రెజిల్‌ ఔషధ నియంత్రణ సంస్థ తెలిపింది. కాగా బ్రెజిల్‌కు చెందిన ప్రెసీసా మెడికమెంటోస్‌తో భారత్‌ బయోటెక్‌ ఒప్పందం చేసుకుంది. సంస్థతో మేము ఒప్పందం రద్దు చేసుకున్నాం అయితే, కొవాగ్జిన్‌ రెగ్యులేటరీ అనుమతుల కోసం అన్వీసాతో కలిసి పని చేస్తాం అని భారత్‌ బయోటెక్‌ వెల్లడిచింది. అయితే సంస్థతో రద్దయిన ఒప్పందంతో పాటే క్లినికల్‌ ట్రయల్స్‌నూ నిలిపివేస్తూ బ్రెజిల్‌ నిర్ణయించడం గమనార్హం.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events