Namaste NRI

భారత్‌, అమెరికా మధ్య కీలక డీల్‌  

భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన నేపథ్యంలో అగ్రరాజ్యం సాయుధ డ్రోన్ల సరఫరా ఆఫర్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న కీలక అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. దాదాపు డజను సాయుధ డ్రోన్లు విక్రయించేలా ఈ డీల్‌ ఉందని వారు వెల్లడించారు. భారత్‌ కూడా చాలా కాలంగా అమెరికా నుంచి సాయుధ డ్రోన్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతోంది. కానీ, బ్యూరోక్రటిక్‌ ఇబ్బందులతో ఈ డీల్‌ ముందుకు వెళ్లడంలేదు. జూన్‌ 22న మోడీ శ్వేతసౌధం పర్యటన ఈ డీల్‌ను ఓ కొలిక్కి తెస్తుందని అంచనా వేస్తున్నారు.

అమెరికాలో మోదీ పర్యటన ఖరారు కాగానే డ్రోన్‌ డీల్‌ విషయంలో పురోగతి చూపించాలని అమెరికా స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌, పెంటగాన్‌ అధికారులు భారత్‌ను కోరారు. దాదాపు 30 ఎంక్యూ9్ఖబి సీ గార్డియన్‌ డ్రోన్లను విక్రయించాలని భావిస్తోంది. ఈ పర్యటనలో ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ మధ్య పలు ఆయుధాల తయారీ, నిర్వహణపై చర్చలు జరగనున్నాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events