
మంచు విష్ణు టైటిల్ రోల్లో భక్తిరస ప్రధానంగా రూపొందిస్తున్న చిత్రం కన్నప్ప. పరమ శివభక్తుడు కన్నప్ప ఇతివృత్తమిది. ఈ సినిమా నుంచి సగమై…చెరిసగమై అంటూ సాగే ఓ మెలోడీ గీతాన్ని విడుదల చేశారు. స్టీఫెన్ దేవస్సీ స్వరాల్ని అందించిన ఈ గీతాన్ని రేవంత్, సాహితి చాగంటి ఆలపించారు. శ్రీమణి రచించారు. ఈ పాటలో నాయకానాయికలు మంచు విష్ణు, ప్రీతి ముకుందన్ల కెమిస్ట్రీ ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాలో అక్షయ్కుమార్ శివుడిగా, ప్రభాస్ రుద్రుడిగా, కాజల్ అగర్వాల్ పార్వతీదేవిగా కనిపించనున్నారు. మోహన్లాల్, మోహన్బాబు, బ్రహ్మానందం వంటి అగ్ర తారలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు మోహన్బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఏప్రిల్ 25న విడుదలకానుంది.
