ధనుష్ రఘుముద్రి, హెబ్బాపటేల్, రేఖా నిరోషా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం థాంక్యూ డియర్. శ్రీకాంత్ దర్శకుడు. బాలాజీ రెడ్డి నిర్మాత. ప్రీరిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. శ్రీకాంత్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించే సున్నితమైన ప్రేమకథా చిత్రం ఇది. తెరపై అందమైన ప్రణయ భావనల్ని ఆవిష్కరిస్తుంది. సమకాలీన సమాజంలో చర్చనీయాంశంగా మారిన ఓ ముఖ్యమైన పాయింట్ను తీసుకొని ఈ సినిమా తెర కెక్కించాం అన్నారు.

మంచి కంటెంట్తో ఈ సినిమా తెరకెక్కించామని, ముక్కోణపు ప్రేమకథగా ఆకట్టుకుంటుందని నిర్మాత పేర్కొన్నారు. నాగ మహేష్, రవిప్రకాష్, ఛత్రపతి శేఖర్ తదితరులు నటిస్తున్నారు. ఆగస్ట్ 1న విడుదలకానుంది. ఈ చిత్రానికి సంగీతం: సుభాష్ ఆనంద్, రచన-దర్శకత్వం: తోట శ్రీకాంత్ కుమార్.















