
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కి అరుదైన గౌరవం లభించింది. మోదీకి బార్బడోస్ దేశం ప్రతిష్ఠాత్మకమైన ఆనరరీ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడం ఆఫ్ బార్బడోస్ పురస్కారాన్ని ప్రదానం చేసింది. కొవిడ్ మహమ్మారి సమయంలో మోదీ సమర్థ నాయకత్వం, విలువైన సహాయాన్ని గుర్తించి ఈ అవార్డును ప్రదానం చేసింది. బార్బడోస్లోని బ్రిడ్జ్టౌన్లో జరిగిన ఓ కార్యక్రమంలో మోదీ తరఫున విదేశాంగ సహాయ మంత్రి పబిత్రా మార్గెటిటా ఈ అవార్డును అందుకున్నారు.

ఈ అవార్డును గతేడాది నవంబర్ 20న గయానాలోని జార్జ్టౌన్లో జరిగిన 2వ ఇండియా- కారికామ్ సమ్మిట్ లీడర్స్ సమ్మిట్ సందర్భంగా ప్రధాని మోదీతో జరిగిన సమావేశంలో బార్బడోస్ ప్రధాని మియా అమోర్ మోట్లీ ప్రకటించినట్లు పేర్కొంది.
