Namaste NRI

తెలంగాణా వాసికి అరుదైన గౌరవం

సౌత్‌ ఇండియా నుంచి మొట్టమొదటిసారి తెలంగాణ వ్యక్తికి గౌరవం దక్కింది. సౌతాఫ్రికా ఐటీ టాస్క్‌ టీం చైర్‌ పర్సన్‌గా గుర్రాల నాగరాజు నియామకం అయ్యారు. ఈ సందర్భంగా గుర్రాల నాగరాజు మాట్లాడుతూ సౌతాఫ్రికా`ఇండియా మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం అయ్యేలా కృషి చేస్తానని స్పష్టం చేశారు. సీఐఐ ఇండియా బిజినెస్‌ ఫోరమ్‌ కార్పొరేట్‌ సభ్యుల ప్రత్యేక సమూహం. సీఐఐ`ఐబీఎఫ్‌ (ఎస్‌ఏ) ఆసక్తి గల కంపెనీల ప్రతినిధుల బృందాలను కూడా నిర్వహిస్తుంది. కొత్త వ్యాపార అవకాశాలకు, వ్యాపార సహకారం కోసం కొత్త మార్గాలను చూపిస్తుందని తెలిపారు. ఈ అవకాశం కల్పించిన సీఐఐ ఇండియా బిజినెస్‌ ఫోరమ్‌( దక్షిణాఫ్రికా)కి ధన్యవాదాలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతను అన్ని రకాలుగా అందరికి ఆమోద యోగ్యంగా నిర్వహిస్తానని తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events