Namaste NRI

టాలీవుడ్ హీరో సాయిధరమ్ తేజ్ కు యాక్సిటెండ్

ప్రముఖ టాలీవుడ్‌ హీరో, మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ బైక్‌ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ రాయదుర్గం పరిధి ఐకియా స్టోర్‌ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సాయిధరమ్‌ తేజ కుడి కంటి పైభాగంతో పాటు ఛాతీ భాగంలో గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతునన సాయతేజ్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కాలర్‌ బోన్‌ విరిగిందని శరీరంలోని అంతర్గతంగా గాయాలేవీ లేవని ఆసుపత్రి వైద్యులు వెల్లడిరచారు. ఈ మేరకు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందాలిసన పని లేదని ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతందని మరో 48 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events