
అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్ లో పాన్ వరల్డ్ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. గత నెలలోనే ఈ సినిమా ప్రకటన వెలువడింది. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మించనుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు ఊపందుకున్నాయి.దర్శకుడు అట్లీ హైదరాబాద్ చేరుకున్నారు. అల్లు అర్జున్తో కలిసి ఆయన ప్రీప్రొడక్షన్ తాలూకు చర్చల్లో పాల్గొనబోతున్నారు. జూన్లో ఈ సినిమా సెట్స్మీదకు వెళ్లనుంది. సైన్స్ఫిక్షన్ చిత్రమిదని సమాచారం. అంతర్జాతీయ ప్రమాణాలతో తెలుగులో రూపొందిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రమిదని మేకర్స్ చెబుతున్నారు.
