Namaste NRI

అమెరికాలో మరోసారి బీభత్సం

అమెరికాలో మరో తుఫాన్‌ విరుచుకుపడి మూడు రాష్ర్టాలపై పంజా విసిరింది. శనివారం ప్రారంభమైన ఈ తుఫాన్‌ టెక్సాస్‌, ఓక్లహామా, అర్కెన్సాస్‌ రాష్ర్టాలను కుదిపేసింది. ఈ తుఫాన్‌ విధ్వంసానికి 11 మంది మరణించగా, వందలాది మంది గాయపడ్డారు.  వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. వేలాది మంది విద్యుత్తు లేక అంధకారంలో మగ్గారు. పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. రాష్ర్టాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలువురు ప్రయాణికులు రహదారులపై చిక్కుకుపోయారు.

Social Share Spread Message

Latest News