Namaste NRI

దుబాయ్‌లో ప్రవాస భారతీయుడు మృతి

75 ఏళ్ల చరిత్రలో కనివీని ఎరుగని విధంగా కురిసిన అకాల వర్షాలు, దుబాయ్‌ను అతలాకుతలం చేశాయి. ఈ వరద బీభత్సానికి ఓ ప్రవాస భారతీయుడు మృతి చెందాడు. రాజన్నసిరిసిల్లా ఇల్లంతకుంట మండలానికి చెందిన భాస్కర్ అనే ఓ ప్రవాసీయుడు, జలప్రళయానికి భయపడి కారులోనే గుండె ఆగి చనిపోయాడు. నీటి ప్రవాహంలో కారు కొట్టుకోపోవడం వల్ల మరణించాడా లేక,  నీళ్లను చూసి గుండేపోటుతో మరణించాడా అనేది ఇంకా తెలియాల్సి ఉందని దుబాయిలోని తెలంగాణ కాంగ్రెస్ ఎన్నారై విభాగం అధ్యక్షుడు యస్వీరెడ్డి తెలిపారు.

Social Share Spread Message

Latest News