Namaste NRI

ఏపీ ఉన్నత విద్యా మండలి కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఎంసెట్‌లో ఇంటర్‌ వెయిటేజ్‌ తొలగించింది. ప్రతీ ఏటా ఇంటర్‌ మార్కులు ఆధారంగా ఎంసెట్‌లో 25 శాతం వెయిటేజ్‌ ఇస్తున్న ఉన్నత విద్యామండలి.. కోవిడ్‌ కారణంగా ఇంటర్‌ పరీక్షలు రద్దు నేపథ్యంలో ఈ ఏడాది వెయిటేజ్‌ తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వంద శాతం ఎంసెట్‌ ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగానే అగ్రికల్చర్‌, ఇంజినీరింగ్‌ విభాగాల్లో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు ఉన్నత విద్యామండలి వెల్లడిరచింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events