Namaste NRI

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆటా మహిళల షార్ట్ క్రికెట్ టోర్నమెంట్‌

అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని టెన‌స్సీ రాష్ట్రంలోని నాష్‌విల్ న‌గ‌రంలో అమెరికా తెలుగు సంఘం(ఆటా) మొట్టమొద‌టిసారిగా మ‌హిళ‌ల షార్ట్ క్రికెట్ టోర్న‌మెంట్‌ను ఏప్రిల్ 8, 9వ తేదీల్లో విజ‌య‌వంతంగా నిర్వ‌హించింది. ఈ టోర్న‌మెంట్‌లో 9 మహిళా టీమ్‌లు పాల్గొన్నాయి. సుమారు 300 మంది ప్రేక్షకుల కేరింతలు, ఈలల మద్య ఎంతో ఉత్సాహభరితంగా ఈ టోర్నమెంట్‌ జరిగింది.  క్రికెట్  పోటీలను ఆటా రీజినల్ కోఆర్డినేటర్‌లుగా ఉన్న క్రిష్ నూకల, సాయిరామ్ రాచకొండతో సహా ఆటా నాష్‌విల్ టీమ్ సభ్యులు భరద్వాజ్ సామల, సాయి వర్ధన్ రెడ్డి బోడా, అనూష వంగాల, ఆనంద్ రామ్‌కుమార్, దిగ్విజయ్ వంగల, ప్రశాంతి రాచకొండ, వంశీ కొరిపెల్లి, రాకేష్ బెక్కం, వాలంటీర్లు నిర్వహించారు.

టోర్న‌మెంట్ నిర్వహణలో రామకృష్ణారెడ్డి ఆల(ఆటా కార్యదర్శి), కిషోర్‌రెడ్డి గూడూరు(బీఓటీ సభ్యుడు), సుశీల్‌ చందా (విద్యాకమిటీ చైర్మ‌న్), నరేందర్‌రెడ్డి నూకల(ప్రాంతీయ సలహాదారుడు) కీలకపాత్ర పోషించారు. ఆటా మహిళల షార్ట్ క్రికెట్ టోర్నమెంట్‌ను నాష్‌విల్లే రైజర్స్ (విజేత జట్టు), పవర్ గర్ల్స్ (రన్నరప్ జట్టు), TNMM (రెండవ రన్నరప్ జట్టు) జట్టులకు ఆటా ట్రోఫీలను అందించింది. క్రీడల‌ పట్ల నిబద్ధతను ప్రోత్సహించడానికి ప్రతి జట్టు సభ్యురాలికి పార్టిసిపెంట్ మెడల్స్ అందించారు.

ఆటా నాష్‌విల్ బృందం ఆటా ఎగ్జిక్యూటివ్ టీమ్, బోర్డ్ ఆఫ్ ట్రస్టీలకు సమాజానికి సేవ చేయడానికి ఈ అద్భుతమైన అవకాశాన్ని అందించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు.  ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన ఇండియా బజార్, చాయ్ సమోసా రెస్టారెంట్‌కు ఆటా సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events