Namaste NRI

మోక్షు హీరోగా ఆదిత్య 369 సీక్వెల్ అనౌన్స్ చేసిన బాలయ్య

బాలకృష్ణ కథానాయకుడిగా సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వంలో రూపొందిన ఆదిత్య 369 (1991) చిత్రం టైమ్‌ ట్రావెల్‌ కథాంశంతో నాటి ప్రేక్షకుల్ని మెస్మరైజ్‌ చేసింది. పాటలు కూడా అద్భుతమైన ఆదరణ పొందాయి. శ్రీకృష్ణదేవరాయలుగా బాలకృష్ణ పాత్ర ఎవర్‌గ్రీన్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమా సీక్వెల్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. తాను హోస్ట్‌ చేస్తున్న అన్‌స్టాపబుల్‌ షోలో బాలకృష్ణ ఈ సినిమా సీక్వెల్‌ ప్రకటన చేయబోతున్నారు. ఈ ఎపిసోడ్‌ శుక్రవారం ప్రసారం కానుంది. ఆదిత్య 999 మాక్స్‌ పేరుతో తెరకెక్క నున్న ఈ సినిమాలో బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ కథానాయకుడిగా నటించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్‌ పనుల్లో బాలకృష్ణ నిమగ్నమై ఉన్నారని, ఆయనే దర్శకత్వం వహించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. శుక్రవారం ప్రసారం కాబోవు అన్‌స్టాపబుల్‌ ఎపిసోడ్‌లో బాలకృష్ణ ఆదిత్య 369 అవతార్‌లో కనిపించనున్నారు. ఈ షోలో ఆయన సీక్వెల్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడిస్తారని చెబుతున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events