బెల్లంకొండ సాయిశ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ భైరవం. విజయ్ కనకమేడల దర్శకత్వం. కె.కె.రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్కి మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ను మేకర్స్ లాంచ్ చేశారు.

పవిత్ర వారాహి ఆలయం చుట్టూ ఈ కథ నడుస్తుందని ట్రైలర్ చెబుతున్నది. ఆధ్యాత్మిక విశ్వాసాలు, స్వార్థ రాజకీయ వికృత చేష్టలు, ముగ్గురు స్నేహితుల గొప్ప స్నేహ బంధం, ఆలయాన్ని, దాని వారసత్వాన్నీ రక్షించేందుకు ఆ స్నేహితులు చేసే పోరాటం ఇవన్నీ ఈ ట్రైలర్లో కనిపిస్తున్నాయి. సినిమాపై ఆసక్తిని పెంచేలా ట్రైలర్ సాగింది. ఈ చిత్రానికి మాటలు: సత్యర్షి, తూమ్ వెంకట్, కెమెరా: హరి కె.వేందాంతం, సంగీతం: శ్రీచరణ్ పాకాల, సమర్పణ: డా.జయంతిలాల్ గడా, నిర్మాణం: శ్రీసత్యసాయి ఆర్ట్స్.
