రాబోయే రోజుల్లో తెలంగాణ అవిర్భావ దినోత్సవం సింగపూర్లో నిర్వహించేందుకు బీఆర్ఎస్ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తానని బీఆర్ఎస్ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల అన్నారు. సింగపూర్ పర్యటనలో భాగంగా మహేష్ బిగాలను తెలంగాణ ఎన్నారైలు కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల బీఆర్ఎస్ పార్టీ అమెరికాలోని డల్లాస్ నగరంలో నిర్వహించామన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఎన్ఆర్ఐల మద్దతుతో విజయవంతమైందన్నారు. ఈ తరహా కార్యక్రమాలు ఇతర దేశాల్లోనూ కొనసాగించేందుకు ఎన్ఆర్ఐ విభాగం శక్తివంతంగా ముందుకు సాగుతున్నదని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో బాలకృష్ణ, లక్షపతి, శ్రీధర్, వినోద్, సందీప్, గంగా సాగర్, బోయిని సమ్మయ్య, అలెక్స్, రవీంద్ర, మణికంఠ, అవుల శివ, రంజిత్ , రజినీకాంత్, శ్రీనివాస్, జితేందర్, పెడ్డి చంద్రశేఖర్ పాల్గొన్నారు.
