Namaste NRI

వీసా కష్టాలకు చెక్‌..తగ్గనున్న అపాయింట్‌మెంట్‌ వెయిట్‌ టైమ్‌

అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు అగ్రరాజ్యం మరో శుభవార్త చెప్పింది. వీసా ఇంటర్వూ అపాయింట్‌మెంట్ కోసం నెలల తరబడి నిరీక్షించే పరిస్థితిని తగ్గించేందుకు వీలుగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం షెడ్యూలిం గ్, రీషెడ్యూలింగ్‌లో కొత్త నిబంధనలు తీసకొస్తోంది. ఇకపై ఎలాంటి అదనపు ఫీజు లేకుండా ఒకసారి అపాయింట్‌మెం ట్ ను రీషెడ్యూల్ చేసుకునే అవకాశం కల్పించనుంది. జనవరి 1, 2025 అంటే నూతన సంవత్సరం నుంచి ఈ కొత్త రూల్స్‌ను అమలు చేయనున్నట్టు భారత్ లోని అమెరికా దౌత్య కార్యాలయం వెల్లడించింది. ప్రతి ఒక్కరికీ పార దర్శకంగా వీసా ఇంటర్వూ అపాయింట్‌మెంట్లు కల్పించాలి. వెయిటింగ్ సమయాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో నిబంధనల్లో కొన్ని మార్పులు చేస్తున్నాం. జనవరి 1, 2025 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. నాన్‌ఇమ్మిగ్రెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారు మీకు నచ్చిన లొకేషన్‌లో ఇంటర్వూ అపాయింట్‌మెంట్ కు తొలి షెడ్యూల్ చేసుకోవచ్చు.

ఒకవేళ ఏ కారణం చేతనైనా, మీరు రీషెడ్యూల్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే ఎలాంటి అదనపు రుసుము లేకుండా ఒకసారి షెడ్యూల్‌ను మార్చుకోవచ్చు. ఆ తర్వాత ఒకవేళ మీరు అపాయింట్‌మెంట్‌ను మిస్ అయినా, లేదా రెండవ సారి రీషెడ్యూల్ చేసుకోవాలనుకున్నా కొత్త అపాయింట్‌మెంట్ కింద బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి మీరు మళ్లీ అప్లికేషన్ రుసుము చెల్లించాలి ” అని ఎంబసీ ఓ ప్రకటనలో వెల్లడించింది. అపాయింట్‌మెంట్ ప్రక్రియను సులభత రం, వేగవంతం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు దౌత్య కార్యాలయం తెలియజేసింది. దరఖాస్తుదారులు షెడ్యూల్ చేసుకున్న సమయంలో ఇంటర్వూలకు హాజరవ్వాలని సూచించింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events