Namaste NRI

చైనా వ్యోమగాములు కొత్త రికార్డు … మొదటిసారిగా   

అంతరిక్ష ప్రయోగాల్లో చైనా వ్యోమగాములు కొత్త రికార్డును సృష్టించారు. మొదటిసారిగా రోదసిలో చేపలను పెంచారు. నవంబర్‌ 4న ముగిసిన షెన్‌జౌ-18 మిషన్‌లో భాగంగా ఈ ప్రయోగాన్ని జరిపారు. అంతరిక్షంలోని ప్రతికూల వాతావరణంలో జలచరాల మనుగడ సాగించగలవా అనేది తెలుసుకునేందుకు ఈ ప్రయోగం చేపట్టారు. ఇందుకోసం మనుషుల జన్యువులతో కొంత పోలి ఉండే, త్వరగా పెరిగే జీబ్రాషిఫ్‌లను ఎంచుకు న్నారు. నాలుగు జీబ్రాషిఫ్‌లను చైనా అంతరిక్ష కేంద్రంలోకి తీసుకెళ్లి, అక్కడ ఓ అక్వేరియంలో పెంచారు. పెరగడం నుంచి పునరుత్పత్తి వరకు 43 రోజుల్లో వీటి పూర్తి జీవచక్రం అంతరిక్షంలోనే పూర్తయ్యింది. అంతరిక్ష జీవ శాస్త్రంలో ఇది కీలక మైలురాయి అని చైనా పరిశోధకులు పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events