![](https://namastenri.net/wp-content/uploads/2024/08/50e409c6-592a-4e9f-922f-2a94141522d8-44.jpg)
కఠినతరమైన వీసా నిబంధనలు, వలసదారులపై ఆందోళనల కారణంగా బ్రిటన్ విశ్వవిద్యాలయాల్లో భారతీయ విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నది. హయ్యర్ ఎడ్యుకేషన్ స్టాటిస్టిక్స్ ఏజెన్సీ (హెచ్ఈ ఎస్ఏ) విడుదల చేసిన డాటా ప్రకారం 2022-23 విద్యా సంవత్సరంలో మిగిలిన దేశాల విద్యార్థుల కన్నా మనదేశ విద్యార్థులే అధికంగా యూకేకు వెళ్లారు. 2018-19 నుంచి చూస్తే మొత్తం మీద భారత విద్యార్థుల సంఖ్య 1,45,650కి పెరిగింది. అయితే ఇటీవల వలసదారులను వ్యతిరేకిస్తూ ఆ దేశంలో జరుగుతున్న ఆందోళ నలు, హింస కారణంగా విద్యార్థులకు ఆ దేశంపై ఆసక్తి తగ్గింది. నిపుణులైన ఉద్యోగులు, విద్యార్థులు వీసాల కోసం చేసే దరఖాస్తుల సంఖ్య గణనీయంగా తగ్గిందని తాజా గణాంకాలు తెలియజేస్తున్నాయి. స్టూడెంట్ వీసా ల సంఖ్య 16 శాతం, డిపెండెంట్ వీసా దరఖాస్తులు 81% తగ్గినట్టు ఆ లెక్కలు వెల్లడించాయి.
![](https://namastenri.net/wp-content/uploads/2024/08/f8900b5f-232d-4ed0-9e9a-f342ae9bc1c6-44.jpg)