Namaste NRI

ధోనీ ఎల్‌జీఎమ్‌ సిద్ధం

ప్రముఖ క్రికెటర్‌ ఎం.ఎస్‌.ధోని చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతూ రూపొందించిన చిత్రం ఎల్‌జీఎమ్‌ (లెట్స్‌ గెట్‌ మ్యారీడ్‌). హరీష్‌ కల్యాణ్‌, ఇవానా, నదియా, యోగిబాబు ప్రధాన పాత్రల్ని పోషించారు. ధోని ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సాక్షి ధోని నిర్మించారు. నిట్రో స్టార్ సుధీర్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా సుధీర్ బాబు మాట్లాడుతూ  ఈ సినిమా ట్రైలర్ చాలా ఎంటర్‌టైనింగ్‌గా, ఆసక్తికరంగా అనిపించింది. లెజెండరీ క్రికెటర్ ధోనీ క్రికెట్‌లో ఎలాంటి విజయాలను సాధించారో అలాంటి సక్సెస్‌ను సినిమా రంగంలోనూ సాధించాలని కోరుకుంటున్నాను అని అన్నారు. సాక్షి ధోని మాట్లాడుతూ  తెలుగు రాష్ర్టాల్లో ధోనికి భారీ సంఖ్యలో అభిమానులు న్నారు. అందుకే ఈ చిత్రాన్ని డబ్బింగ్‌ చేసి విడుదల చేస్తున్నాం. జీవితంలోని అనుబంధాల గురించి చర్చించే చిత్రమిది. ఓ ఇండిపెండెంట్‌ అమ్మాయి పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఆమె మనసులోని భావాలు ఎలా ఉన్నాయి? ఆమె తీసుకున్న నిర్ణయం ఏమిటన్నదే చిత్ర కథాంశం అన్నారు.ఈ కార్యక్రమంలో సుధీర్‌బాబు, నదియా తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రం  ఆగస్ట్‌ 4న ప్రేక్షకుల ముందుకురానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events