
గోపీచంద్ కొత్త చిత్రం హైదరాబాద్లో ప్రారంభమైంది. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా కుమార్ సాయి దర్శకుడు. థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కించనున్న ఈ సినిమా ద్వారా మలయాళీ నటి మీనాక్షి దినేష్ తెలుగులో నాయికగా అరంగేట్రం చేస్తున్నదని, భారీ వ్యయంతో నిర్మించబోతున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభిస్తామని మేకర్స్ తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: శామ్దత్ ఐఎస్సీ, సమర్పణ: బాపినీడు, దర్శకత్వం: కుమార్ సాయి.
