Namaste NRI

శ్వేత సౌధంలో ఘనంగా దీపావళి వేడుకలు

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌  ఆధ్వర్యంలో శ్వేత సౌధం లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. బ్లూరూమ్‌లో జరిగిన ఈ వేడుకల్లో బైడెన్‌ కార్యవర్గంలోని ఇండో-అమెరికన్‌లు, అధికారులు, కార్పొరేట్‌ దిగ్గజాలు, దాదాపు 600 మందికిపైగా అతిథులు హాజరయ్యారు. వేడుకల సందర్భంగా ఆ ప్రాంతాన్ని పూలతో సుందరంగా అలంకరించారు.  ఈ వేడుకల నేపథ్యంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి వ్యోమగామి సునీతా విలియమ్స్‌ ప్రత్యేక సందేశాన్ని పంపారు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రథమ మహిళ జిల్‌ బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ గైర్హాజరయ్యారు. అధ్యక్ష ఎన్నికల ప్రచార కార్యక్రమాల కారణంగా వీరిద్దరూ వేడులకు హాజరుకాలేదని సదరు వర్గాలు తెలిపాయి.

Social Share Spread Message

Latest News