Namaste NRI

శ్వేత సౌధంలో ఘనంగా దీపావళి వేడుకలు

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌  ఆధ్వర్యంలో శ్వేత సౌధం లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. బ్లూరూమ్‌లో జరిగిన ఈ వేడుకల్లో బైడెన్‌ కార్యవర్గంలోని ఇండో-అమెరికన్‌లు, అధికారులు, కార్పొరేట్‌ దిగ్గజాలు, దాదాపు 600 మందికిపైగా అతిథులు హాజరయ్యారు. వేడుకల సందర్భంగా ఆ ప్రాంతాన్ని పూలతో సుందరంగా అలంకరించారు.  ఈ వేడుకల నేపథ్యంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి వ్యోమగామి సునీతా విలియమ్స్‌ ప్రత్యేక సందేశాన్ని పంపారు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రథమ మహిళ జిల్‌ బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ గైర్హాజరయ్యారు. అధ్యక్ష ఎన్నికల ప్రచార కార్యక్రమాల కారణంగా వీరిద్దరూ వేడులకు హాజరుకాలేదని సదరు వర్గాలు తెలిపాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events