
నయనతార ప్రధాన పాత్రలో రూపొందిన మూకుతి అమ్మన్ చిత్రం అమ్మోరు తల్లి పేరుతో తెలుగులో విడుదలైన విషయం తెలిసిందే. ఆ సినిమాకి సీక్వెల్గా ముకుతి అమ్మన్ 2 తెరకెక్కనుంది. నయనతార లీడ్రోల్ పోషిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రానికి సుందర్.సి దర్శకుడు. వెల్స్ ఇంటర్నేషనల్, ఐవీ ఎంటైర్టెన్మెంట్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. చెన్నైలో ఈ సినిమాకోసం నిర్మిస్తున్న కోటి రూపాయల భారీ సెట్లో ఈ సినిమాకు సంబంధించిన పూజాకార్యక్రమాలు లాంఛనంగా జరిగాయి. చిత్ర యూనిట్తో పాటు టాలీవుడ్ నిర్మాతలు సునీల్ నారంగ్, జగదీష్. సి.కల్యాణ్ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. మూకుతి అమ్మన్ 2 అన్ లిమిటెడ్ నవ్వులతో, ఎక్సయిటింగ్ కథాంశంతో రూపొందనున్నదని, నయన్నతార పాత్ర ఊహలకు అతీతంగా ఉంటుందని సుందర్.సి తెలిపారు. దునియా విజయ్, రెజీనా కాసాండ్రా, యోగిబాబు, ఊర్వశి, అభినయ, రామచంద్రరాజు, అజయ్ఘోష్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: గోపీ అమర్నాథ్, సంగీతం: హిప్ హాప్ ఆది.
