Namaste NRI

జర్మనీలో తెలుగు ప్రవాసుల భారీ ర్యాలీ

 పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు చేసిన దాడిని నిరసిస్తూ జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌ నగరంలో తెలుగు ప్రవాసులు భారీ ర్యాలీ నిర్వహించారు. భారత్‌, జర్మనీ జెండాలతో శాంతి ర్యాలీ చేపట్టి ఉగ్రదాడి మృతులకు నివాళులు అర్పించారు. కైసర్‌సాక్‌ నుంచి నగరం నడిబొడ్డున ఉన్న పాల్‌స్పాట్జ్‌ వరకు దేశభక్తి గీతాలు పాడుతూ ఐక్యతా నినాదాలు చేస్తూ సంఫీుభావాన్ని ప్రకటించారు. భారతీయ సమాజం బలాన్ని సంస్కృతిని చాటి చెప్పారు. ఈ కార్యక్రమంలో భారతీయ డయాస్పోరా సభ్యులు, తెలుగు కుటుంబాల నుంచి గిరిరావ్‌ కొమ్మూరి,  ఆనంద్‌, అనిల్‌ బత్తిని, ప్రహ్లాద నాగేంద్రప్ప, లోకేష్‌, ప్రభంజన్‌ గాదెలతోపాటు శశి, ఆదర్శ్‌ల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events