చైనాకు చెందిన యాప్స్కు ఉక్కుపాదం మోపిన కేంద్రం మరో షాక్ కు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. భారత స్మార్ట్ఫోన్ మార్కెట్ల్ చైనా కంపెనీల దూకుడుకు బ్రేక్ వేసేందుకు సిద్దమవుతోందని సమాచారం. రూ.12 వేల రూపాయల్లోపు ధరలో మొబైళ్లను విక్రయించుకుండా నిషేధం విధించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. చైనా మొబైల్ తయారీ కంపెనీల ప్రవేశంతో కుంగిపోయిన దేశీయ మొబైల్ కంపెనీలకు ఊతమిచ్చేందుకు గానూ ఈ నిర్ణయం తీసుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.














