Namaste NRI

భారత్ కీలక నిర్ణయం.. ఆ రెండు దేశాల వీసాలు ఇచ్చేది లేదు

భారత్‌ కీలక నిర్ణయం తీసుకుంది. కెనడా, బ్రిటన్‌ దేశాలకు చెందిన పౌరులకు ఈ`వీసాలు నిరాకరించింది. కరోనా సమయంలో భారత ప్రయాణికుల ఎంట్రీపై కెనడా, యూకే కఠినంగా వ్యవహరించిన నేపథ్యంలోనే ఇప్పుడు భారత్‌ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ రెండు దేశాలలో అతితో కోవిడ్‌ సమయంలో భారత ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. అనంతరం రెండు దేశాల్లో ఎంబసీ అధికారులు కలుగజేసుకుని సమస్యను పరిష్కరించారు.  ఈ మేరకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒకరు కీలక ప్రకటన చేశారు.

                ఈ ఏడాది ఆగస్టు మొదటి వారం నుంచి కెనడా, యూకే పౌరులకు ఈ`వీసా సౌకర్యాన్ని నిలిపివేయడం జరిగింది. ప్రస్తుతం వారు భారత ఎంబసీల్లో రెగ్యులర్‌ స్టిక్కర్‌ వీసాలకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. పర్యాటక వీసా ఇప్పటికే నిలిపివేయబడిరది. ఇతర కేటగిరీ వీసాలపై భారత్‌కు వచ్చే ఈ రెండు దేశాల పౌరులు ఇప్పుడు కేవలం రెగ్యులర్‌ స్టిక్కర్‌ వీసాల కోసం దరఖాస్తు చేసుకోవాలి అని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events