![](https://namastenri.net/wp-content/uploads/2025/01/b3d00086-ff84-4237-b83a-c233d621b400-11.jpeg)
లద్ధాఖ్ నుంచి ఆక్రమించిన అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని రెండు కొత్త కౌంటీలుగా ఏర్పాటు చేస్తూ చైనా తీసుకున్న నిర్ణయంపై భారత్ నిరసన తెలిపింది. ఈ విషయమై విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైశ్వాల్ మాట్లాడుతూ చైనా రెండు కొత్త కౌంటీలను ఏర్పాటు చేస్తూ చేసిన ప్రకటనను చూశాం. ఈ కౌంటీల్లో కొన్ని భాగాలు లద్ధాఖ్లో ఉన్నా యి. భారత భూభాగాన్ని ఆక్రమించిన చైనా తీరును ఎన్న డూ అంగీకరించలేదు. భారతదేశ సార్వభౌమాధికారంపై మా దీర్ఘకాలిక, స్థిరమైన వైఖరిపై కొత్త కౌంటీల ఏర్పాటు నిర్ణయం ప్రభావం చూపించదు అని పేర్కొన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/01/b87c51be-597c-4d61-9699-36202c2fdcb5-11.jpeg)