Namaste NRI

భారత్‌ కీలక నిర్ణయం ..కెనడా పౌరులకు

జీ20 వర్చువల్‌ సమావేశం నిర్వహించడానికి ముందు భారత్‌ కీలక నిర్ణయం తీసుకుంది. కెనడా పౌరులకు ఎలక్ట్రానిక్‌ వీసా సేవలను పునరుద్ధరించినట్లు అధికారిక వర్గాలు తెలిపారు. దాదాపు రెండు నెలల తర్వాత వీసా సేవలను ప్రారంభించడం గమనార్హం. ఈ చర్యతో పర్యటక వీసాతో పాటు కెనడాకు అన్ని రకాల వీసాలను పునరుద్దరించినట్లయింది. కెనడాకు వ్యాపార, మెడికల్‌ వీసా సేవలను భారత్‌ గత నెలలోనే ప్రారంభించింది. ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్‌ హత్య కేసు వివాదంలో సెప్టెంబర్‌ 21న కెనడాకు భారత్‌ వీసాలను రద్దు చేసిన విషయం తెలిసిందే.

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య కేసులో భారత దౌత్య వేత్తల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిస్‌ ట్రూడో ఆ దేశ పార్లమెంట్‌లో ఆరోపించాడు. ఈ ఆరోపణలను భారత్‌ తీవ్రంగా ఖండిరచింది. ఎలాంటి ఆధారాలు లేకుండా రాజకీయ ప్రయోజనాల కోసం ట్రూడో ఆరోపణలు చేస్తున్నారని మండిపడిరది. ఈ అంశంపై ఇరుదేశాల మద్య దౌత్యపరమైన ప్రతిష్టంభన నెలకొంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events