Namaste NRI

భారత్‌కు జపాన్‌, యూఏఈ సంఘీభావం

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌ సాగిస్తున్న యుద్ధానికి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, జపాన్‌ సంఘీభావం ప్రకటించాయి. పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదం గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు పార్లమెంట్‌ సభ్యులతో కూడిన భారత ప్రతినిధి బృందం రెండు దేశాల రాజధానులను సందర్శించింది. శివసేన ఎంపీ శ్రీకాంత్‌ షిండే సారథ్యంలోని ప్రతినిధి బృందం యూఏఈ నేతలతో చర్చలు జరిపింది. జేడీయూ ఎంపీ సంజయ్‌ షా నేతృత్వంలోని మరో ప్రతినిధి బృందం జపాన్‌ నాయకులతో సంప్రదింపులు జరిపింది.

Social Share Spread Message

Latest News