Namaste NRI

సమయానికే.. తీస్‌మార్‌ ఖాన్‌

ఆది సాయికుమార్‌ నటిస్తున్న తాజా చిత్రం తీస్‌మార్‌ ఖాన్‌. పాయల్‌ రాజ్‌పుత్‌ నాయిక. సునీల్‌, పూర్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కళ్యాణ్‌ జి.గోగణ దర్శకత్వంలో వ్యాపారవేత్త డా.నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ఇప్పటికే గ్లింప్స్‌, టీజర్‌, ఫస్ట్‌సింగిల్‌ను విడుదదల చేసింది చిత్రబృందం. సమయానికే అంటూ ఈ సాగే ఈ సినిమా రెండో పాట వీడియోను రిలీజ్‌ చేశారు. సాయి కార్తీక్‌ స్వరపరచిన ఈ మెలోడీ ట్యూన్‌కు రాకేందు మౌళి సాహిత్యం అందించగా శ్రుతి ఆలపించారు. ఇందులో అనూప్‌సింగ్‌ ఠాకూర్‌, కబీర్‌సింగ్‌ తదితరులు నటించారు. ఆగస్ట్‌ 19న విడుదల కానున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: యాళ్ల తిర్మల్‌ రెడ్డి, సంగీతం: సాయికార్తీక్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events