Namaste NRI

మీనాకుమారిగా కియారా?

బాలీవుడ్‌ ట్రాజెడీ క్వీన్‌ మీనా కుమారి జీవిత కథ ఆధారంగా దర్శకుడు సిద్ధార్థ్‌ పి మల్హోత్రా మల్‌ ఔర్‌ మీనా పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. హిందీ కవి, దర్శకుడు కమల్‌ అమ్రోహితో మీనా కుమారి ప్రేమాయణం మొదలుకొని వారి విఫల దాంపత్య జీవితం వరకు జరిగిన ఆసక్తికరమైన సంఘటనలతో ఈ సినిమాను రూపొందించబోతున్నారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్‌ దశలో ఉన్న ఈ సినిమా త్వరలో సెట్స్‌మీదకు వెళ్లనుంది.  తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో కియారా అద్వాణీ కథానాయికగా నటించనుందని తెలిసింది. ఇటీవలకాలంలో దర్శకుడు సిద్ధార్థ్‌ పి మల్హోత్రా సోషల్‌మీడియా పోస్ట్‌లకు వరుసగా స్పందిస్తున్నది కియారా అద్వాణీ. ముఖ్యంగా ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌ మొదలుకొని వివిధ ప్రచార చిత్రాలు అద్భుతమంటూ ప్రశంసించింది. ఈ నేపథ్యంలో మీనా కుమారి పాత్రలో కియారా అద్వాణీ నటించడం దాదాపు ఖాయమైందని, చిత్ర బృందం సైతం ఇప్పటికే ఆమెతో చర్చలు జరిపాయని బాలీవుడ్‌ సినీ వర్గాల్లో వినిపిస్తున్నది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events