Namaste NRI

కుబేర సెకండ్ సింగిల్..అనగనగా కథ

నాగార్జున, ధనుష్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మల్టీస్టారర్‌ చిత్రం కుబేర. రష్మిక మందన్న కథానాయిక. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం.  సునీల్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు నిర్మించారు. సమాజంలోని ఆర్థిక, సామాజిక అంతరాల్ని చర్చిస్తూ సందేశాత్మక కథతో దర్శకుడు శేఖర్‌ కమ్ముల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సినిమాలోని అనగనగా కథ.. అందరికీ తెలిసిన కథ అంటూ సాగే రెండో గీతాన్ని విడుదల చేశారు.

దేవిశ్రీప్రసాద్‌ స్వరపరచిన ఈ పాటకు చంద్రబోస్‌ సాహిత్యాన్నందించారు. సమాజంలోని ఆర్థిక అంతరాలు, అవినీతి వంటి అంశాలను చర్చిస్తూ లోతైన భావాలతో ఈ పాట సాగింది. హైదే కార్తీ, కరీముల్లా ఆలపించిన ఈ పాటలో ధనుష్‌, నాగార్జున పర్‌ఫార్మెన్స్‌ ఎమోషనల్‌గా సాగింది. పాన్‌ ఇండియా రేంజ్‌లో భారీ స్థాయిలో చిత్రాన్ని విడుదల చేయబోతున్నామని మేకర్స్‌ తెలిపారు. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకురానుంది.

Social Share Spread Message

Latest News