ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఖరారైన కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్ రెడ్డి, బండ ప్రకాష్, తక్కెళ్లపళ్లి రవీందర్ రావు, పాడి కౌశిక్ రెడ్డి, మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డిలకు టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాల శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సామాజిక న్యాయం పాటిస్తూ ప్రతిభావంతులకు పట్టం కట్టారన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థులు నేడు అసెంబ్లీలో నామినేషన్లను సమర్పించారు.














