Namaste NRI

న్యూయార్క్ మెట్ గాలా ఫ్యాషన్ షో లో మేఘా కృష్ణారెడ్డి సతీమణి

అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో ప్రతిష్ఠాత్మక ఫ్యాషన్‌ వేడుక మెట్‌ గాలా 2021 ఘనంగా జరిగింది. ఈ అంతర్జాతీయ ఫ్యాషన్‌ వేదికపై హైదరాబాద్‌ నగరానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త మేఘా కృష్ణారెడ్డి సతీమణి సుధాకర్‌ రెడ్డి తళుక్కుమన్నారు. మెట్‌ గాలాలో సుధాకర్‌ రెడ్డి పాల్గొనం ఇదే తొలిసారి. ఈ ఏడాది భారత్‌ నుంచి పాల్గొన్నది ఆమె ఒక్కరే కావడం గమనార్హం. ఈ ఏడాది థీమ్‌ అమెరికన్‌ ఇండిపెండెన్స్‌కు తగ్గట్లు అమెరికా జెండాలోని రంగులను తలపించేలా భారతీయ ఫ్యాషన్‌ డిజైనర్లు ఫల్గుని, షేన్‌ పీకార్‌ ప్రత్యేకంగా తీర్చిదిద్దిన గౌనును ఆమె ధరించారు. దీనికి తయారీకి 250 గంటల పట్టినట్లు డిజైనర్లు తెలిపారు. ఇప్పటి వరకు ఈ షోలో బాలీవుడ్‌  హీరోయిన్లు ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే, ఇషా అంబానీ తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events