Namaste NRI

మన్ కీబాత్ లో తిరుపతి యువకుడికి మోదీ అభినందనలు

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి యువకుడు సాయి ప్రణీత్‌ను ప్రధాని  నరేంద్ర మోదీ మన్‌ కీ బాత్‌ సందర్భంగా మెచ్చుకున్నారు. సాయి ఏపీ వెదర్‌ మ్యాన్‌ పేరుతో వాతావరణ సమాచారాన్ని  సోషల్‌ మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తున్నాడు. ఈ నేపథ్యంలో మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో సాయి ప్రణీత్‌ పేరును మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. సోషల్‌ మీడియా సాయంతో రైతులకు ఆ యువకుడు అందిస్తున్న సేవలను మోదీ కొనియాడారు. సాయి ప్రణీత్‌ బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజీనీర్‌గా పని చేస్తున్నాడు. గత ఏడేళ్లుగా వాతావరణ అంశాలను విశ్లేషిస్తూ ఐఎండీ, ఐక్యరాజ్య సమితి నుంచి మన్నలు పొందారు. ఈ క్రమంలో సాయి ప్రణీత్‌ అందిస్తున్న సేవలను తెలుసుకుని మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో భాగంగా మోదీ ప్రస్తావించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events