Namaste NRI

నోబెల్ శాంతి బహుమతికి మస్క్ నామినేట్

అమెరికన్ బిలియనీర్ ఎలాన్ మస్క్ ఈ ఏడాది నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ అయ్యారు. వాక్ స్వాతంత్య్రం, మానవ హక్కుల రక్షణ కోసం చేస్తున్న కృషికి గుర్తింపుగా ఆయన పేరు నామినేట్ అయ్యిందని యూరోపియన్ పార్లమెంట్ సభ్యుడు బ్రాంకో గ్రిమ్స్ వెల్లడించారు. ఎలాన్ మస్క్ పేరును నామినేట్ చేస్తూ నార్వే నోబెల్ కమిటీ ముందు పిటిషన్ దాఖలైనట్టు గ్రిమ్స్ తెలిపారు. టెస్లా, స్పేస్-ఎక్స్ సంస్థలకు సీఈవోగా ఉన్న ఎలాన్ మస్క్ను ట్రంప్ సర్కార్ డోజ్ హెడ్గా నియమించింది.

Social Share Spread Message

Latest News