గత వారం ఏం పనులు చేశారో చెప్పాలని డోజ్ అధిపతి ఎలాన్ మస్క్ 48 గంటల డెడ్లైన్ విధించడం వేలాది అమెరికా ఫెడరల్ ఉద్యోగులను అయోమయంలో పడేసింది. అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల మేరకు ఫెడరల్ ఉద్యోగులందరికీ త్వరలోనే ఒక ఈమెయిల్ వస్తుంది. దీనికి స్పందించడంలో విఫలమైనవారు రాజీనామా చేసినట్టు పరిగణిస్తాం అని మస్క్ తెలిపారు.

ఈ మెయిల్ వచ్చిన కొద్ది సేపటికే ఉద్యోగులందరికీ గత వా రం పనుల గురించి అయిదు బుల్లెట్ పాయింట్లలో వివరించాలని, సీసీ కాపీ మేనేజర్కూ పంపాలని, సోమవారం అర్ధరాత్రి 11. 59లోగా ఈ పని చేయాలని ఈ మెయిల్ వచ్చింది. మస్క్ నుంచి వచ్చిన ఈ అసాధారణ ఆదేశం జాతీయ వాతావరణ సేవల విభాగం సహా పలు శాఖల్లో గందరగోళాన్ని సృష్టించింది.
