అమెరికాలోని అట్లాంటా నగరంలో మే 20న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) శతజయంతి ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఎన్టీఆర్ అభిమానులు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా టీడీపీ తెలంగాణ ఉపాధ్యక్షురాలు నందమూరి సుహాసిని, టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష, టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు వైవీఎస్ చౌదరి హాజరు కానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అట్లాంటాలోని డేసనమిడిల్ స్కూల్లో ఈ కార్యక్రమానికి నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకావడానికి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభించారు.



