ఐర్లాండ్ దేశంలో నివసిస్తున్న తెలుగు వారి ఆధ్వర్యంలో తెలుగు జాతి కీర్తి పతాకం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డా.నందమూరి తారకరామారావు శతజయంతి వేడుక వైభవంగా జరిగింది. రాజధాని డబ్లిన్ నగరంలోని సుప్రసిద్ధ ఫీనిక్స్ పార్క్లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రపంచంలో ఎక్కడా జరగని రీతిలో వినూత్నంగా ప్రకృతి అందాల నడుమ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ కార్యక్రమం నిర్వహించడం విశేషం. ఎన్టీఆర్ తెలుగు జాతికి చేసిన విశిష్ట సేవలు, మధుర స్మృతులు జ్ఞప్తి చేసుకున్నారు. ఎన్టీఆర్కు భారత రత్న ఇవ్వాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. ఐర్లాండ్ భారత రాయబారికి ఆ వినతి పత్రాన్ని అందించాలని ఏకగ్రీవంగా తీర్మానించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా తెలుగు సాంప్రదాయ రుచులు ఆస్వాదించారు. తెలుగువారు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని ఎన్టీఆర్కు ఘన నివాళి అర్పించారు.