Namaste NRI

ఇండియాతో సహా ఆ నాలుగు దేశాలకు అనుమతి!

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో హర్మూజ్​ జలసంధిపై ఇరాన్ కీలక వ్యాఖ్యలు చేసింది. తన మిత్ర దేశాలైన ఇండియా, చైనా, రష్యా, ఇరాక్‌, పాకిస్థాన్‌ వంటి ఐదు దేశాల నౌకల ప్రయాణానికి హర్మూజ్‌ జలసంధిని అనుమతి ఇస్తామని ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చి ప్రకటించారు. ఈ మేరకు ఈ విషయాన్ని ముంబైలోని ఇరాన్ కాన్సులేట్‌ జనరల్‌ కార్యాలయం వెల్లడించింది.

కాగా, దేశంలో ఇంధన కొరత ఏర్పడుతోందన్న ఆందోళనలు కొనసాగుతున్న వేళ ఇరాన్‌ ప్రకటన ఇండియాకు ఎంతో ఉపశమనం కలిగించింది. ఉద్రిక్తతల కారణంగా భారత్‌కు చెందిన నౌకలు రోజుల తరబడి అక్కడే నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే మన నౌకలు సురక్షితంగా హర్మూజ్‌ దాటేందుకు ఇరాన్ అధికారులతో కేంద్రం నిరంతరం సంప్రదింపులు జరిపింది. ఇప్పుడు ఇరాన్ ప్రకటనతో భారత్‌కు పెట్రోల్‌, గ్యాస్‌ సమస్యలు తగ్గే అవకాశం ఉంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events