భారత్పై సుంకాల బాదుడుకు తెరతీసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ యుద్ధంపై మరోసారి దృష్టి సారించారు. సంధి కుదిర్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న ట్రంప్, రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ను కలుస్తాను అని ప్రకటించారు.

ఆగస్టు 15న అలస్కాలో పుతిన్తో భేటి అయి పలు విషయాలపై చర్చిస్తానని ట్రంప్ తెలిపారు. దాంతో, ఇరువురి మధ్య జరుగబోయే సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ట్రంప్, పుతిన్ల భేటీని భారత్ స్వాగతించింది. అని ట్రంప్ ప్రకటించారు. ఈ సమావేశం తర్వాత ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకడంపై స్పష్టత రానుందని ఇండియా భావిస్తోంది.















