Namaste NRI

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

రాజేంద్రప్రసాద్‌, అర్చన ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం షష్టి పూర్తి. పవన్‌ప్రభ దర్శకుడు. రూపేష్‌, ఆకాంక్ష సింగ్‌ నాయకానాయికలు. మా ఆయి ప్రొడక్షన్స్‌ పతాకంపై రూపేష్‌ నిర్మించారు. ఎన్నో ప్రత్యేకతల సమాహారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, లేడీస్‌ టైలర్‌ విడుదలైన 38 ఏళ్ల తర్వాత రాజేంద్రప్రసాద్‌, అర్చన కలిసి నటించడం, ఆస్కార్‌ గ్రహీత ఎం.ఎం.కీరవాణి తొలిసారి మేస్ట్రో ఇళయరాజా స్వర సారథ్యంలో పాట పాడటం సినిమాకు ప్రధానాకర్షణలుగా నిలిచాయని దర్శకుడు తెలిపారు. ఇప్పటికే విడుదల చేసిన రెండు పాటలకు శ్రోతల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తున్నదని, వింటేజ్‌ ఇళయరాజా మ్యూజిక్‌ విన్న ఫీల్‌ ఉందనే ప్రశంసలొస్తున్నాయని నిర్మాత తెలిపారు. ఈ సినిమాను ఈ నెల 30న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు.  ఈ చిత్రానికి కెమెరా: రామ్‌, సంగీతం: మాస్ట్రో ఇళయరాజా, స్క్రీన్‌ప్లే, సంభాషణలు: పవన్‌ప్రభ.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events