Namaste NRI

సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన నిర్మాత ఎ.ఎం రత్నం  

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని సినీ నిర్మాత ఎ.ఎం.రత్నం కలిశారు. హరిహర వీరమల్ల్లు  చిత్రానికి సంబంధించిన అంశాలపై ఆయనతో చర్చించారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ నిర్మణ సంస్థ ఓ పోస్ట్‌ చేసింది. 17వ శతాబ్దానికి సంబంధించిన కథతో రూపొందిన హరిహర వీరమల్లు గురించి సీఎంతో చర్చించాను.  తెలంగాణలో ఈ సినిమా టికెట్‌ ధరల గురించి కూడా మాట్లాడినట్లు, తన విలువైన సమయాన్ని కేటాయించినందుకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  రేవంత్‌రెడ్డికి ఎ.ఎం రత్నం కృతజ్ఞతలు తెలిపారు.

పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం హరి హర వీరమల్ల్లు. నిధి అగర్వాల్‌ కథానాయిక. క్రిష్‌, జ్యోతికృష్ణ దర్శకత్వంలో పీరియాడిక్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌గా రూపొందిన ఈ చిత్రం జూన్‌ 12న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

Social Share Spread Message

Latest News