యూరప్ ఖండంలోనే మొదటిసారిగా థేమ్స్ నదిపై బ్రే, మైదన్ హెడ్ వద్ద శ్రీవేంకటేశ్వర బాలాజీ టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్ ( ఎస్వీబీటీసీసీ) ఆధ్వర్యంలో అత్యంత భక్తిశ్రద్ధలతో తెప్పోత్సవం ( దివ్వ తెప్పోత్సవం) నిర్వహించారు. యూరప్లోని హిందూ ప్రవాసభారతీయుల ఆధ్మాత్మిక, సాంస్కృతిక చరిత్రలో ఇదో మైలురాయి. విదేశీ నేలపై తొలిసారి జరిపిన భక్తి పర్వదినంగా ఈ కార్యక్రమం నిలిచిపోయిందని భక్తులు పేర్కొన్నారు.


సుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి, గోవిందా గోవిందా నామస్మరణల మథ్య థేమ్స్ నదిలో విహరించారు. భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని రెండు విడతలుగా సాగిన ఈ భక్తి నౌకా యాత్ర, బ్రిటిష్ వాతావరణంలో దక్షిణ భారతీయ ఆలయాల అనుభూతిని అందించింది. వేద పారాయణం, భజనలు, సామూహిక అర్చనలతో ఆధ్యాత్మిక ఉత్సహంతో నిండిన కార్యక్రమానికి వందలాది మంది భక్తులు తరలివచ్చారు. ఈ అపూర్వ ఘట్టాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరినీ ఎస్వీబీటీసీసీ కృతజ్ఞతలు తెలిపింది.





