
సూర్య హీరోగా తెలుగులో చేస్తున్న సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు హైదరాబాద్లో జరిగాయి. టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకుడు. ప్రతిష్టాత్మక టాలీవుడ్ నిర్మాణ సంస్థ సితార ఎంటైర్టెన్మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. సూర్య, మమితా బైజులపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్లాప్ కొట్టగా, నిర్మాత ఎస్.రాధాకృష్ణ బౌండ్ స్క్రిప్ట్ని దర్శకుడు వెంకీ అట్లూరికి అందించారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి జి.వి.ప్రకాశ్కుమార్ సంగీతం అందిస్తున్నారు. రవీనా టాండన్, రాధిక శరత్కుమార్ కీలక భూమికలు పోషిస్తున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని, వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు. తెలుగుతోపాటు తమిళంలో కూడా ఏకకాలంలో ద్విభాషా చిత్రంగా సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రానికి కెమెరా: నిమిష్ రవి, నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య, సమర్పణ: శ్రీకర స్టూడియోస్.
