రష్యా, ఉక్రెయిన్ మధ్య మూడేళ్ల నుంచి యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ రెండు దేశాలు కాల్పుల విమరణ అంశంపై తక్షణమే చర్చలు చేపట్టనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో రెండు గంటల పాటు ఫోన్లో చర్చలు జరిపిన తర్వాత ట్రంప్ ఈ విషయాన్ని చెప్పారు. పుతిన్తో ఫోన్ చర్చలు సజావుగా సాగినట్లు ట్రంప్ పేర్కొన్నారు. అయితే శాంతి కోసం రెండు దేశాల మధ్య చర్చలు అవసరమన్నారు.

ట్రంప్ ఆశాజనక స్టేట్మెంట్ ఇచ్చినా, కాల్పుల విరమణ లేదా శాంతి ఒప్పందం కుదిరేలా ఉన్నట్లు కనిపించడంలేదన్న అభిప్రాయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఉన్నారు. శాంతి ఒప్పందంపై కుదిరే అంశం గురించి చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పుతిన్ పేర్కొన్నారు.
