ఎన్టీఆర్ 102వ జయంతిని పురస్కరించుకొని జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్ లో ఈ నెల 24, 25 తేదీల్లో మినీ మహానాడు నిర్వహించనున్నారు. ఎన్ఆర్ఐ టీడీపీ జర్మనీ విభాగం అధ్యక్షుడు పవన్ కుర్రా ఎన్ఆర్ఐ టీడీపీ ప్రతినిధులతో కలిసి మినీ మహానాడు పోస్టర్ ను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే గౌతు శిరీష, గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం ప్రధాన కార్యదర్శి సుమంత్ కొర్రపాటి, మినీ మహానాడు సమన్వయకర్తలు శ్రీకాంత్ కుడితిపూడి, శివ పాల్గొన్నారు.
