Namaste NRI

జాక్ పాట్ కొట్టిన భారతీయుడు…లాటరీలో

దుబాయి డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ రాఫెల్‌  లో భార‌తీయుడు జాక్‌పాట్ కొట్టాడు. భార‌తీయ వ్యక్తి సయ్యద్ అలీ బతుషా తివంశ దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్‌లో 1మిలియ‌న్ డాల‌ర్లు(రూ. 8.22కోట్లు) గెలుచుకున్నాడు. దీంతో అలీ బతుషా రాత్రికి రాత్రే కోటీశ్వ‌రుడ‌య్యాడు. దుబాయి అంతర్జాతీయ విమానాశ్రయం లోని టెర్మినల్-2 వద్ద నిర్వహించిన లక్కీ డ్రాలో మనోడు కొనుగోలు చేసిన టికెట్ నెం. 4392కు ఈ జాక్‌పాట్ త‌గిలింది. యూఏఈలో ఉండే అలీ బతుషా ఆగస్టు 30వ తారీఖున ఆన్‌లైన్‌లో అతడు ఈ లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. అలా సరదాగా కొన్న లాటరీ టికెట్ ఇప్పుడు అతడికి కోట్లు తెచ్చిపెట్టింది. కాగా, బుధవారం నిర్వహించిన డ్రాలో ఆన్‌లైన్‌లో కొన్న టికెట్‌కు లాటరీ తగలడంతో నిర్వాహకులు అతడి ఫోన్ నంబర్‌కు కాల్ చేశారు. కానీ, కలవలేదు. దాంతో ఇతర మార్గాల్లో అతనికి ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు దుబాయ్ డ్యూటీ ఫ్రీ నిర్వాహకులు వెల్లడించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events