Namaste NRI

మహాయజ్ఞం దిగ్విజయమైంది.. అసౌకర్యానికి గురైఉంటే క్షమించండి : మోదీ

కోట్లాది మంది భక్తుల విశ్వాసం, అఖాడాల ఆశీర్వాదాలతో హిందువులు పవిత్రంగా భావించే ప్రయాగ్‌రాజ్‌ మహా కుంభ మేళా  శివరాత్రి పర్వదినమైన బుధవారం వైభవంగా ముగిసింది. ప్రజల భక్తి, ఐక్యత, సామరస్యాల సంగమంగా నిలిచిన ఈ వేడుకకు త్రివేణి సంగమం సాక్షిగా నిలిచింది. 45 రోజులపాటు జరిగిన ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్మాత్మిక వేడుకలో దాదాపు 66 కోట్ల మందికిపైగా భక్తులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఈ మహాకుంభమేళాపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తాజాగా స్పందించారు. ఐక్యత కోసం జరిగిన ఈ మహాయజ్ఞం దిగ్విజయంగా ముగిసిందన్నారు.

భారతీయ ఐక్యతకు ఈ కుంభమేళా నిదర్శనంగా నిలిచిందని వ్యాఖ్యానించారు. వివిధ ప్రాంతాల నుంచి కోట్లాది మంది భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించినట్లు చెప్పారు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఎలాంటి ఆటంకాలూ లేకుండా విజయవంతంగా నిర్వహించడం అంత సులువు కాదన్నారు. అన్నిటినీ దాటుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన యూపీ ప్రభుత్వం, ప్రజలకు ఈ సందర్భంగా ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. పూజల్లో ఏదైనా లోపం ఉంటే క్షమించాలని గంగా, యమునా, సరస్వతి మాతాలను ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. అంతేకాదు ఏర్పాట్ల విషయం లోపాలున్నా, భక్తులెవరైనా అసౌకర్యానికి గురైనా అందుకు క్షమించాలని ప్రధాని కోరారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events