తాలిబన్ల వశమైన ఆఫ్ఘనిస్థాన్లో శాంతి భద్రతలు రోజురోజుకు దిగజారుతుండడంతో ప్రజల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోంది. మరీ ముఖ్యంగా దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో వ్యాపారులపై దాడులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాలిబన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వ్యాపారులు తమ స్వీయ రక్షణ ఆయుధాలను వెంట తీసుకువెళ్లవచ్చని ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రకటించింది. ఆయా సాంకేతిక సమస్యల పరిష్కారం ఆనంతరం ఈ నిర్ణయం అమలు చేయనున్నట్లు తెలిపింది. వ్యాపారులు, పెట్టుబడిదారుల భద్రతకు తాము కట్టుబడి ఉన్నామని ఆ శాఖ అధికార ప్రతినిధి సయీద్ ఖోస్టాయ్ తెలిపారు.