
భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ కోసం అమెరికా ఎటువంటి మధ్యవర్తిత్వం వహించలేదని విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్రీ పార్లమెంటరీ కమిటీకి స్పష్టం చేశారు. రెండు పొరుగుదేశాల మధ్య ద్వైపాక్షిక స్థాయిలో సైనిక చర్యలు నిలపివేయాలని నిర్ణయం జరిగినట్లు మిస్రీ తెలియచేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. భారత్, పాక్ మధ్య సైనిక ఘర్షణను నిలిపివేయడంలో తమ ప్రభుత్వ పాత్ర ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలుసార్లు ప్రకటిండాన్ని కొందరు ప్రతిపక్ష సభ్యులు ప్రశ్నించిన నేపథ్యంలో మిస్రీ వ్యాఖ్యలు వెలువడ్డాయి. ట్రంప్ ప్రకటనలను మిస్రీ తోసిపుచ్చినట్లు ఆ వర్గాలు తెలిపాయి.
